Saturday, March 7, 2015

అన్నట్టు ఆ జైలు అధికారులు ఏం చేస్తున్నట్టు..?


నిర్భయ కేసు లో నిందితుడు ఉన్నట్టుండి ఇప్పుడొక వి.ఐ.పి.అయిపోయినాడు.అసలు జైలు లో ఉన్న ఆ క్రిమినల్ తో ఇంటర్వ్యూ తీసుకుంటామంటే బి.బి.సి.వారికి ఎందుకు అనుమతులు ఇచ్చారు..?అదే మరి ఒక భారతీయ చానెల్ కి ఇచ్చే పని ఎందుకు చేయలేదు..!చెప్పడానికి కొన్ని మాటలు సరిపోవు గాని ..ఇప్పటికి భారత దేశాన్ని పాలిస్తున్నది బ్రిటిష్ వారే.కాకపోతే పద్ధతులు మారాయి.విధానాలు కొత్త రూపు దాల్చాయి. ప్రస్తుతం ఉన్న మరియు ఇవ్వబడిన సౌకర్యాలకి  దానికి వ్యక్తిగతం గా వారు రానవసరం లేదు.ఉపగ్రహాల ద్వారా,కంప్యూటర్ల ద్వారా,మొబైల్స్ ద్వారా, నెట్ ద్వారా మన కంటికి కనిపించని చెప్పినా నమ్మలేని ద్వారాల ద్వారా యావద్ భూమిని వారి స్నేహ వర్గం పాలిస్తున్నది.మన లాగా కుక్కల చింపిన విస్తరి కోసం కొట్టుకొని బయట బడరు ..ఎందుకంటే అక్కడ తమదైన  నీతి ఉన్నది.సంపద ఉన్నది.అంతకు మించి ప్రతి దేశం లోనూ వారి ఆజ్ఞలకి లోబడి పనిచేసే నాయకత్వం ఉన్నది.కొంత మంది అజ్ఞాతం గా..కొంతమంది తెలిసేట్టుగా..అంతే తేడా..!Click here

No comments:

Post a Comment