Sunday, November 1, 2015

The 3 mistakes of my life ..చేతన్ భగత్ రాసిన నవల ఇటీవలనే చదివాను

The 3 mistakes of my life ..చేతన్ భగత్ రాసిన నవల ఇటీవలనే చదివాను.ఇంచుమించు 35 వయసు లో ఉండి ,పంజాబీ కుటుంబానికి చెంది ,ఢిల్లీ IIT లో ఇంజనీరింగ్ చేసిన ఇతని నవల అదీ ఆంగ్లం లో రాసినది గమ్మత్తుగా ఉంది.ఇతను ఇంగ్లీష్ లో రాయకపోతే నేను చదవగలిగేవాడినా..ఏ హిందీ లో అయినా..పంజాబీ లో అయినా..ఇప్పటికీ ఇంగ్లీష్ ప్రాధాన్యత అలా ఉన్నది అది అంతే..!ఇప్పటికీ దేశాన్ని ఐక్యత వేపు తీసుకెళ్ళేది ఆంగ్లమే.నచ్చినా నచ్చక పోయినా..! మొత్తం మీద అనిపించినది ఏమంటే ఆంగ్లం లో రాసేటప్పుడు ఎవరికైనా స్థానిక ప్రభావం పడితీరుతుంది..వాక్య నిర్మాణం లో గాని...ఇంకో దానిలో గాని.అదేమీ అంత తప్పు కాదు.ఎవరైనా ఆ భిన్నత ని ఆస్వాదిస్తారు..!గ్రామర్ పరంగా తప్పులు వెదకదలుచుకున్న వారికి కోకొల్లలుగా దొరుకుతాయి.కాని కధ చెప్పే విధానం లో మమేకమై అలా వెళ్ళిపోతాము.అసలు ఇంగ్లీష్ అంత Flexible భాష మరొకటి లేదు.ఫ్రాంజ్ కాఫ్కా ని జర్మన్ లోనుంచి గాని ,డోస్తోవిస్కీ ని రషయన్ లో నుంచి గాని,పావ్లో కొయ్లో ని పోర్చుగీస్ లోనుంచి గాని మన అందరకి దగ్గరకి చేర్చింది ఇంగ్లీష్ కాదు...?ఎన్ని రకాలైనా వారివైన వ్యక్తీకరణలు..? కాని గుండెకి తాకే చెమ్మదనం..అది ఏ రసం గాని.

సరే..చేతన్ భగత్ రాసిన ఈ నవల కి వాద్దాము. కధ అంతా గుజరాత్ నేపధ్యం లో సాగుతుంది.అదీ అహ్మదాబాద్.ఆనంద్ పటేల్  అనే యువకుడు తాను సూసైడ్ చేసుకోబోతున్నట్లు రచయిత   కి ఒక ఈమెయిల్ పెడతాడు.మొత్తానికి తన తెలివి తో ఆ వ్యక్తి ని ఓ ఆసుపత్రి లో కలుసుకుంటాడు.ఇహ అతను తన కధ అంతా చెబుతాడు.తనకి గల స్నేహితులు Ish,Omi  ఇంకా ఇతరులతో గల సంబంధాలు.అదే నవల మొత్తం యొక్క సారాంశం. Anand Patel అనే తను అహ్మదాబాద్ లో తల్లి తో జీవిస్తుంటాడు.తండ్రి మరణిస్తాడు.అతని స్కూల్ ఫ్రెండ్స్  Omi,Ish ల తో కలిసి చిన్న బిజినెస్ ప్రారంభిస్తాడు.Omi మామ హిందూ  పార్టి లో పనిచేస్తుంటాడు. Anand ట్యూషన్స్ కూడా చెబుతుంటాడు.ఆ క్రమం లో అతను Ish సోదరిని ప్రేమిస్తాడు.వీరి కి ముస్లిం కుర్రాడు దొరుకుతాడు..అతని పేరు  ali..!  Ish   క్రికెట్ లవర్ కాబట్టి అతని లోని టాలెంట్ ని గుర్తించి బాగా పైకి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తాడు.ఆ క్రమం లో అక్రమ మార్గం లో ఓ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ని సైతం మీట్  అవుతాడు.అయితే ఆలీ మాత్రం తాను ఇండియన్ ని గనక ఇండియా తరపునే ఆడతానంటాడు. దానితో చాన్స్ మిస్ అవుతుంది.

అదలా ఉండగా గోధ్రా అల్లర్లు సమీపిస్తాయి.Omi మామ యొక్క కొడుకు ఇంకా ఇతరులు ఆ రైలు లో చనిపోవడం తో కనబడిన ముస్లింస్ నల్లా చంపడాకి ఇతను జనాల్ని వేసుకుని బయలుదేరుతాడు.ఆ క్రమం లో ఆలి ని తనకి వదిలి పెట్టమని అన్నా,ఈ ముగ్గురు కలిసి అతన్ని రక్షిస్తారు.ఆ క్రమం లో ఒకరు మరణిస్తారు.అతను Omi అని చెప్పి అతని మేనల్లుడు.చివరకి తాను ప్రేమించిన స్నేహితుని సోదరి విద్య కూడా ముంబాయి వెళ్ళిపోవడం తో నిరాశ కి గురయి ఆనంద్ సూసైడ్ కి ప్రయత్నిస్తాడు.

చివరకి రచయిత కి తన గాధ అంతా రాయడానికి ఒప్పుకుంటాడు.అట్లా ఎపిలోగ్ ముగుస్తుంది.ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఇది ప్రధానంగా గోధ్రా అల్లర్లు నేపధ్యాన్ని భూమిక గా తీసుకుని సాగుతుంది.దానికి ముగ్గురు స్నేహితుల కధని పై పూత గా అద్దాడు అని చెప్పాలి.నా మటికి నాకు చెప్పాలంటే చేత భగత్ లో కధని తెలివి గా నడిపించే చాక చక్యం ఉంది గాని లోతైన ఇంగ్లీష్ భాషా జ్ఞానమేమి లేదు.ఆర్.కె.నారాయణ్ గాని మనోజ్ దాస్ గాని ఇలాంటి పాత తరం ఇండో ఆంగ్లికన్ రచయితలతో పోలిస్తే బోలుగా అనిపిస్తుంది కొన్ని చోట్ల.అయినా దీన్ని నిరుత్సాహ పరచను..ఇలాంటివి ఇండియన్ మొజాయిక్ నుంచి ఎన్నో రావాలి...   ఆ విధంగానే భిన్నత్వం లో ఏకత్వం సిద్దిస్తుంది.Click here

No comments:

Post a Comment