Thursday, January 17, 2019

ఈశాన్య రాష్ట్రాల గూర్చి తెలిసినది ఎంత...మన లో చాలా మందికి..?




ఈశాన్య రాష్ట్రాల గూర్చి తెలిసినది ఎంత...మన లో చాలా మందికి..? అవి మన దేశం లో అంతర్భాగాలే..!అక్కడి కధలు ఏవిటో,ఇతర ప్రక్రియలు ఏవిటో తెలిసింది చాలా తక్కువ.ఆసక్తి కూడా తక్కువే.Seven sisters గా పిలువబడే ఆ రాష్ట్రాల్లో చాలా వైవిధ్యం ఉన్నది.దేని ఇది దానిదే.వాళ్ళ భాషల పద్ధతి,ఆచారాల పద్ధతి మిగతా దేశం తో పోలిస్తే భిన్నమే.నాగాలాండ్,అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం ..ఇలా మిగిలిన వాటిల్లోనూ దేని దారి దానిదే అయినా అక్కడి ప్రధాన తెగల్లోనూ  మిక్కిలిగా ఉప జాతులు ఉండటం తో బాప్టిస్ట్ చర్చ్ ప్రభావం వల్ల ఇంగ్లీష్ అక్కడ కామన్ భాష గా మారిపోయింది.అలా అని వారి భాషల్ని మాటాడమూ వదల్లేదు..అది వేరే సంగతి.అక్కడ నుంచి జాజ్ సంగీత కారులు ఇంకా ఇండో ఆంగ్లికన్ రచయితలు ఎంతోమంది వచ్చారు.

సరే....అసలు విషయానికి వస్తే నేను ఇప్పుడు ఒక పుస్తకం గురించి చెబుతాను.నాగా తెగ లో అనేక ఉప తెగలు ఉన్నాయి.దానిలో ఒకటి Zeme అనేది.వీరు తమ ప్రాంతం లో చెప్పబడే కొన్ని జానపద కధల్ని సేకరించి వారి రాబోయే తరాల కోసమని అనండి లేదా ఇతరులకి తెలపడం కోసం అనండి ఓ పుస్తకాన్ని వెలువరించారు.అది ఎప్పుడో మైసూర్ లో ఉన్నప్పుడు కొన్నప్పటికి ఈ మధ్యనే చదివాను.కొన్ని వాక్యాలు దాని గురించి రాయాలని ఇలా సంకల్పించాను.  
కధల్ని సేకరించి పుస్తకరూపం లోకి తీసుకువచ్చినవారు Pauning Haikam,Keoutso Kapfo అనే ఇద్దరు.ఈ పుస్తకం పేరు Zeme Folktales,భారత ప్రభుత్వ సంస్థ CIIL,Mysore వారు ప్రచురించారు.మొత్తం 31 కధలు ఉన్నాయి.ప్రకృతి తో మనిషి కి ఉండే అనురక్తత,మనిషి కి మనిషి కి మధ్య గల అనేక రకాల సంబంధాల లో ఉండే రంగులు ఇలాంటివి మనని ఆకట్టుకుంటాయి.ఉదాహరణకి దీనిలోని మొదటి కధ ని వివరిస్తాను.A Step Mother కధ పేరు.అనగా అనగా Benru అనే గ్రామం లో Herielung అనే బాలుడు ఉండేవాడు.అతని తల్లి చిన్నప్పుడే చనిపోయింది.వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు ఈ అబ్బాయిని బాగా చూసుకోవ డానికి ఒకరు ఉండాలని.అయితే ఆమె ఈ కుర్రాడిని మంచి గా చూసుకోదు.కాలం గడుస్తున్న కొద్దీ ఊరికే ఉంటే ఏమి బాగుంటుంది...అందుకే పొలం పనులకి వెళుతుంటాడు.అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఇతనికి మంచి నేస్తాలు అవుతారు.ఇతను ఎప్పుడు అన్నం తిన్నా ఒంటరి గా తింటూ ఊంటాడు.ఒకసారి ఇతను వేరే పనిలో ఉన్నప్పుడు ఇతని చద్ది చూస్తే వెగటు పుడుతుంది.ఎలుక గొద్దెలు కూడా ఉంటాయి.ఆ అమ్మాయిలు బాధపడి ఇతడిని అడుగుతారు.మా పినతల్లి ఇలాగే పెడుతుంది.అందుకే అన్నం తినేప్పుడు మీకు కనిపించకుండా తింటాను అని చెపుతాడు.ఆ అమ్మాయిలు ఇతనికి వాళ్ళ అన్నం పెడతారు.

అయిన తర్వాత మీ శాలువ లు నాకు ఇవ్వండి మీకు ఓ అద్భుతం చూపిస్తా అంటాడు ఈ కుర్రాడు.సరే అని ఇస్తారు.తను చెట్టు కొమ్మ ఎక్కి ఈ శాలువ ని కప్పుకొని ఓ పక్షి లా అరుస్తూ ఉంటాడు.ఉన్నట్లుండి అతను hornbill  పక్షి లా మారిపోగా కిందకి దిగి రమ్మని అమ్మాయిలు అడుగుతారు.లేదు లేదు...ఇలాగే నాకు హాయి గా ఉంది.మీరెప్పుడైనా పక్షుల గుంపు ని మీ గ్రామం లో చూశారనుకో..దానిలో నేను ఉంటాను.మీరు నన్ను గుర్తు పడతారు నాకు తెలుసు.అప్పుడు మీకు నేను ఎన్నో రంగురంగుల ఈకలని బహుమతి గా ఇస్తాను..సరేనా..అంటూ తుర్రుమని ఎగిరిపోయాడు.కొన్ని రోజుల తర్వాత చెప్పినట్లుగానే ఆ అమ్మాయిల ఊరి మీదు గా ఎగురుతూ వచ్చి వీళ్ళకి మంచి ఈకలని బహుమతి గా విసిరేస్తూ వెళతాడు.అతను తన గ్రామం మీదుగా ఎగురుతూ ఉండగా పిన తల్లి కూడా నోరు తెరిచి ఏమైనా ఇస్తుందా ఈ పక్షి అని చూస్తూ ఉంటుంది.వెంటనే ఈ పక్షి ఆమె నోటి లో రెట్ట వేసి తుర్రుమంటుంది.ఆ పినతల్లి శపిస్తూ తరుముతుంది.అయితే ప్రతి ఏడు పొలంపనులు అయిపోయిన తర్వాత ఉండే విశ్రాంతి దినం లో ఒక పండుగని చేస్తుంటారు.ఆ పక్షుల గుంపు ఇప్పటికీ వస్తూనే ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు.

అదీ అలా ముగుస్తుంది కధ.దీనిలో ఎన్ని జానర్ లు ఉన్నాయో గదా..!ఒకసారి ఆలోచిస్తే..!ఇంకొన్ని కధల్లో దెయ్యాలూ ఉంటాయి మనుషుల్తో కలిసిపోయి వ్యవహరిస్తూ.కొన్ని నీతి కధలు.కొన్ని భయానకాలు.ఇలా రకరకాలు.ఇంకా ఒకటి ఏమిటంటే కొన్ని అసభ్య పదాల వంటివీ ఉంటాయి గాని అవి కధలో మిక్స్ అయిపోయి మామూలుగా నే అనిపిస్తాయి.దేశం లోనే అత్యంత తక్కువ గా స్త్రీలపై  అత్యాచారాలు నమోదయ్యే రాష్ట్రం ఈ నాగాలాండ్.బహుశా ఒకప్పటి మాతృస్వామ్య ప్రభావం అనుకుంటాను. ఒక వెరైటీ కోసం ,నాగా తెగ లోని జానపద కధల్ని తెలుసుకోవడం కోసం చదవండి.Contact: Central institute of Indian languages ,Manasa Gangotri,Mysore-570006 (Karnata State)/ Price :Rs.235 (They would give 50% discount)  ----Murthy Kvvs 

No comments:

Post a Comment