Sunday, May 29, 2016

The Last Labyrinth నవల గురించి కొన్ని మాటలు.....

The Last Labyrinth నవల గురించి కొన్ని మాటలు.....

నేను ఇపుడు ఒక నవలని పరిచయం చేస్తాను.దాని పేరు ఎలాగు పైన చూశారు గదు...రచయిత ఎవరు అంటే అరుణ్ జోషి ..వారణాసి లో జన్మించి అమెరికా లో చదువుకుని భారత దేశం వచ్చి కార్పోరేట్ ప్రపంచం లో ఎన్నో అంచులు చూసి చివరకి తన ఆత్మ ఎక్కడ ఉంది అని అన్వేషించి నవలా రంగం లోకి అడుగు పెట్టి న ఒక మనిషి రాసిన కధ అది.నాకు పేరు వస్తుందా..లేదా ధనం వస్తుందా అని యోచించ కుండా ముందుకు వెళ్ళిన ఆయన భావజాలాన్ని నాకు తోచిన మేరకు పరిచయం చేస్తాను.అసలు లాబిరింథ్ అంటే దాని లోనే సగం అర్ధం అవుతుంది.ఇది ఒక తిక మక కధ అని.నిజానికి జీవితం కూడా ఒక తికమకనే మనం బాగా గమనిస్తే. అయితే అంత తొందరగా అంగీకరిస్తే మనం మనుషులం ఎలా అవుతాము .

నా దృష్టి లో  భారతీయుని గా జన్మించి ఆంగ్లం లో తనదైనశై లి లో రాయగలిగిన కొద్ది మంది రచయిత ల లో ఆయన ఒకరు.ఈ రోజున ఇంగ్లీష్ అనేది గ్లోబల్ భాష ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా..దాన్ని మార్చే దమ్ము ఎవరికి లేదు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా...

ఎందుకంటే మన Elite  ఏదైనా ఆ సమాజం తో కలిసి పనిచేయవలసిందే..బయటకి ఎన్ని కబుర్లు చెప్పినా  ...లేదా వీరి బిజినెస్ ద్వారాలు మూసుకుపోతాయి బయటి ప్రపంచం తో...!సరే..కధలోకి వద్దాము..! నిజంగా ఆంగ్ల భాష లోని variation  ని అర్ధం చేసుకోవాలంటే ఈ నవలని చదవమని తెలుగు పాఠకుల్ని అర్ధిస్తున్నాను.ఎందుకంటే...ఒక భారతీయుడు తనదైన అదిభౌతిక వాద ప్రపంచాన్ని కేవలం ఇంగ్లీష్ వాళ్ళ లానే కాదు ఆ భాష నేర్చిన భారతీయునిలా ఎలా వ్యక్తం చేయవచ్చునో  దీని నుంచి గ్రహించవచ్చును.సంభాషణలు కావచ్చును..వివిధ సన్నివేశాల్లో వ్యక్తీకరణ కావచ్చును..ఒక మాదిరిని ఏర్పరిచాడు.గతం లో ఆర్. కె.నారాయణ్ వంటి భారతీయాంగ్ల రచయితలనుంచి  ఆహా ఎంత  పురోగమించింది ఈ ప్రపంచం అనిపించక మానదు...!అదే ఈ Indo Anglican రచనా ప్రపంచం.

సరే....స్థూలంగా కధ చిన్నదే.Som Bhaskar అనబడే హీరో...అలానే అనుకుందాం.ముంబాయి అతనిది.ఒక స్టార్ హోటల్ లో Aftab అనే వ్యాపారవేత్తని కలుస్తాడు.అతను ఎవరు..ఒక పురాతన చరిత్ర ఉంటుంది ... వారణాశి అతనిది..! ! అతని పూర్వికులు మొగలుల ఆస్థానం లో పనిచేసిన వారు.స్థితిమంతుడు..అనేక పురాతన భవనాలకి అధిపతి.జీవితాన్ని మధువు వలె ఆస్వాదించే వ్యక్తి. అతని కి భార్య వంటి వ్యక్తి అనురాధ.గతం లో ఒక సినిమా నటి.ఎన్నో చేదు,తీపి జీవితానుభవాలు గల స్త్రీ.ఆమె Aftab తో కలిసి ఉంటుంది...అది ఒక గమ్మత్తైన అనుబంధం.ఆమె కి ఏ రకంగాను అతను ఆటంకంగా ఉండడు.అలాగని ఆమె కూడ విలువరహితం గా చూడటం ఉండదు.అలాంటి ప్రపంచం లోకి ఈ Bhaskar వస్తాడు.దేనికి..Aftab కి చెందిన ఒక కంపెని ని టేక్ ఒవర్ చేయడానికి.అతను ఈమె పట్ల క్రమేణా ఆకర్షితుడవుతాడు.ఎన్నో రకాల సన్నివేశాలు ఈ మధ్య లో జరుగుతాయి.కంపెని షేర్లు ఒక హిమాలయాల్లోని గ్రామీణ వ్యక్తి దగ్గర న్నాయని తెలిసి అక్కడకి బయలుదేరుతాడు.అదంతా ఒక ఊహించనలవిగాని సన్నివేశాలతో సాగుతుంది.

అసలు మనం ఇలాంటి వాటితో ఒక కధని నిర్మించవచ్చునా అనిపిస్తుంది.జీవితం యొక్క అంతర్ అర్ధాన్ని  మనకి బోరు అనిపించకుండా చెపుతాడు రచయిత.ముఖ్యంగా వారణాశీ ని దగ్గర గా చూసిన అనుభూతి కలుగుతుంది.ఆ ఇరుకు వీధులు.ఆ నేర ప్రపంచం..ఆ వీధులు ల లోని నా నా చండాలం..అదే సమయం లో..దానికి దగ్గర లోనే ఋషిపుంగవుల వంటి వ్యక్తులు..వారిని..ముస్లిం లు..హిందువులు అనే తేడా లేకుండా గౌరవించడం...ఇలా అనేక రంగులు..మన కళ్ళ ముందు మెదులుతాయి.మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా చదవండి. దీనికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ సైతం వచ్చింది.అరుణ్ జోషి లో నాకు నచ్చిన అంశం ఏమంటే అతని ఇంగ్లీష్ మన భారతీయ భాష లానే అనిపిస్తుంది.అదే సమయం లో అతని వ్యక్త భావం ఎక్కడో లోతు గా పోయి తగులుతుంది...!ఈ నవల లో దక్షిణాది మరియు ఉత్తరాది  బ్రాహ్మణులకు ఉన్న వ్యత్యాసం కూడా బాగా తెలుస్తుంది.Murthy Kvvs

No comments:

Post a Comment