Sunday, December 17, 2017

చెప్పేది ఎక్కువ.చేసేది తక్కువ.అంటే ఇదే.

మొత్తానికి ప్రపంచ తెలుగు మహాసభలు మొదలైనాయి.మిశ్రమ ఫలితాలు వెలువడుతున్నాయి.కొంతమంది ఒకలా ...ఇంకొకళ్ళు ఇంకోలా.గరికపాటి ని ఆహ్వానిస్తే ఆయన తిరస్కరించాటడ...ఆంధ్ర సి ఎం ని పిలువ లేదని.అసలు ఈ రాజకీయాలు అన్నీ ఆయనకి అవసరమా... అవి రాజకీయ నాయకులు పరస్పర అవసరం కోసం చేసుకునేవి.ఇవాళ తిట్టుకుంటారు..ఇంకోరోజు పిచ్చగా పొగుడుకుంటారు..అవసరాన్ని బట్టి.అంతదాక ఎందుకు హైద్రాబాద్ లో సాఫ్ట్ ఫేర్ అభివ్రుద్ది అంత బాబు పుణ్యమే అని కెటీయార్ ఫీలర్ వదిలాడు కొన్ని రోజుల క్రితమే.

కనక తెలుగు భాష ,సాహిత్యం శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు.గరికపాటి ఒక పొలిటీషియన్ లా వ్యవహరించాడు తప్ప సరస్వతీ పుత్రుని గా కాదు.ఇటువంటి ఓ ప్రకటన ఇచ్చినందుకు ఆయనకి ఆంధ్ర అధికార వర్గాల్లో పలుకుబడి పెరగవచ్చుగాక.కాని తెలుగు భాష కి సంబందించి ఆయన ప్రేమ ఏమిటో అర్ధం అయింది.బతకనేర్చిన తనం ఒక్క మాటలో చెప్పాలంటే.

అసదుద్దీన్ ఒవైసీ ని ఈసారి ప్రముఖంగా చెప్పవలసిందే.తెలుగు లో మాట్లాడి ..చివరన తప్పులున్నచో మన్నించమని కోరాడు.అది మామూలు విషయం కాదు.అది కెసియార్ యొక్క మిత్రత్వం కి ఇచ్చిన విలువ.అది దమ్మున్నవాడు చేసే పని.మా తెలుగుల మనసులు గెలుచుకున్నావు ఒవైసీ ....నీకు సాల్యూట్.తమిళనాడు గాని కేరళ వెళ్ళినా అక్కడ ఆ యా భాషల్లోనే మతపరమైన పాటలు ప్రసంగాలు సాగుతాయి.అట్లా అని అక్కడి వారికి అరభీ భాష రాదని కాదు...తాము ఎక్కడ జన్మించామో ఆ భాషల్ని గౌరవించాలనే స్పృహ వారికి వున్నది.ఇక్కడ లేదని కాదు.

వాళ్ళు తెలుగు లో మాట్లాడటానికి ప్రయత్నించే లోపే వచ్చిన బ్రోకెన్ ఉర్దూ లో మాట్లాడుతూ వారి ప్రయత్నాన్ని అడ్డుకునే మన సగటు తెలుగులది.చెప్పేది ఎక్కువ.చేసేది తక్కువ.అంటే ఇదే.  

No comments:

Post a Comment